విశాఖ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఏపీలో కరోనా కేసులు 10 లక్షలు దాటాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తూతూమంత్రంగా సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రపంచమంతా కరోనాపై పోరులో బిజీగా ఉంటే జగన్ రెడ్డి రాజకీపోరులో బిజీగా ఉన్నారన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. రోజురోజుకు ఆక్సిజన్ కొరత తీవ్రమవుతోందన్నారు. కొవిడ్ ఆస్పత్రులను పెంచడం లేదని.. క్వారంటైన్ కేంద్రాలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలంటే పాలకులకు లెక్కలేనితనమన్నారు. ప్రభుత్వం అలసత్వం వీడి కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.