ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకోర్టుకు కేంద్రం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 12, 2021, 09:00 AM

 గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రైతు సంఘాలు నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఢిల్లీ పోలీసు విభాగం ద్వారా పిటిషన్ దాఖలు చేయించింది. గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ట్రాక్టర్ల కవాతును నిర్వహించాలని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ చర్య యావత్తు దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుంది వివరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం రాజ్యాంగపరమైన, చారిత్రకపరమైన ఆవశ్యకతను కలిగి ఉందని తెలిపింది. 26వ తేదీకి మూడు రోజుల ముందు నుంచే రిహార్సల్స్‌ జరుగుతాయి. కనుక దేశ రాజధాని ప్రాంతంలో ఏ రూపంలోనూ నిరసనలు, ధర్నాలు, కవాతులు నిర్వహించకుండా నిలువరించాలి అని దిల్లీ పోలీసు విభాగం సుప్రీంకోర్టుకు విన్నవించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com