18 లక్షల విలువైన 46 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి ముగ్గురిని తాడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తాడికొండ పార్క్ నందు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత నాలుగు నెలలుగా జిల్లాలోని ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన ఒంటిపులి దుర్గారావు, వేముల అంకయ్య, బండ బాలకృష్ణ ముగ్గురు కలసి జిల్లాలోని పలు గ్రామాలలో 46 ద్విచక్ర వాహనాలను దొంగలించారు. ఇటీవలే కంతేరు గ్రామంలో రెండు బైకులను విక్రయించగా, గ్రామస్తులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అమ్మిన వ్యక్తి పై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, మొత్తం 46బైకులు దొంగతనం చేసినట్లుగా అంగీకరించారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరచిన సిబ్బందికి రివార్డ్ అందచేశారు.