ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను శుక్రవారం నాడు కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకోబోతున్నారు. వీరిద్దరి మధ్య అరగంటకు పైగా భేటీ జరుగుతుందని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను గవర్నర్ కు తెలియజేస్తారని అంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించనున్నారు. స్థానికసంస్థల ఎన్నికల విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు స్వయంగా జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు.