ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 12, 2020, 05:11 PM

భారత ప్రభుత్వం నిషేధించిన పబ్‌జీ మొబైల్ మళ్లీ తిరిగి వచ్చేస్తోంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన PUBG Mobile India గేమ్‌ను లాంఛ్ చేస్తున్నట్టు పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో 100 మిలియన్ డాలర్లు అంటే రూ.746 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్‌ను ఇండియాలో లాంఛ్ చేయడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో గేమ్‌ప్లే ఉండేలా చర్యలు తీసుకుంటామని, సెక్యూరిటీపై దృష్టిపెడతామని, భారతదేశంలో లోకల్ వీడియో గేమ్, ఇస్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేస్తామని పబ్‌జీ కార్పొరేషన్ ప్రకటించింది. పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ ఎప్పుడు లాంఛ్ చేస్తామన్న సంగతి ప్రకటించలేదు. వీలైనంత త్వరగా ఈ గేమ్ లాంఛ్ చేస్తామని ప్రకటించింది. ఇండియన్ సబ్సిడరీని సృష్టిస్తామని తెలిపింది. భారతదేశంలో గేమ్ డెవలప్‌మెంట్, ఇస్పోర్ట్స్, బిజినెస్ కోసం 100 మంది ఉద్యోగులను కూడా నియమించుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com