విశాఖలోని గీతం డీమ్డ్ వర్సిటీ భవనాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే గీతం వర్సిటీ యాజమాన్యం నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారో తమకు తెలియదనీ, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదనీ పేర్కొంటున్నారు. ఇలా ఉండగా కూల్చివేత సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలోఅక్కడకు చేరుకున్నాయి. పోలీసులు భారీగా మోహరించారు.