సంగీత ప్రపంచాన్ని మైమరపించే విధంగా ఎన్నో వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు శుక్రవారం విశాఖ టిడిపి కార్యాలయంలో బాలసుబ్రమణ్యం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు భాషల్లో బాలు పాడిన పాటలు అద్భుతం అన్నారు.ఎంతోమంది అనారోగ్యం బారిన పడిన వారు సైతం బాలు పాడిన పాటలకు కోలుకొని నేడు హాయిగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి శ్రద్ధాంజలి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామ్,మాజీ శాసనసభ్యులు గవిరెడ్డిరామానాయుడు, పైలా ముత్యాల నాయుడు, బూర్జలక్ష్మి. నాగోతి శివాజీ,సర్వసిద్ధి అనంతలక్ష్మి,గనగల సత్య, తమ్మినవిజయ్ కుమార్, దోన్నుమాస్టారు, సమర్థ రఘునాద్ తదితరులు పాల్గొన్నారు.