పంటల సీజన్ వేళ దేశంలోని పేద రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) ద్వారా ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో నగదు బదిలీ చేశారాయన.
పీఎం కిసాన్ పథకం కింద పేద రైదులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందజేస్తున్నది. 2018, డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలవుతుండా, ఆదివారం నాడు ఆరో విడత నగదు బదిలీని ప్రధాని చేపట్టారు. ఈ పథకం కోసం కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.