ఏపీలో 3 రాజధానులకు గవర్నర్ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఆగష్టు 16న విశాఖలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలో రాజధాని నిర్మాణానికి అమరావతిలో శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధాని మోడీ,తెలంగాణ సీఎం కేసీఆర్ లను అప్పటి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సారి కూడా ప్రధాని మోడీని రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఒకవేళ ప్రధాని నేరుగా హాజరయ్యే అవకాశం లేకుంటే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా పాల్గొనాలని కోరనున్నారు. కోర్టులలో కేసులు నడుస్తున్నా రాజధాని పై ముందుకే పోవాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు.