ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌,చైనా మధ్య నేడు మళ్లీ చర్చలు

international |  Suryaa Desk  | Published : Tue, Jul 14, 2020, 08:52 AM

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద నుంచి బలగాలను వెనక్కి  మళ్లించే విషయంపై భారత్‌, చైనాల మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య నాలుగో దఫా చర్చలు మంగళవారం  జరగనున్నాయి.  తూర్పు లఢక్‌లో ఎల్‌ఏసీ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్‌లో ఈ సమావేశం జరగనుంది.  సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడం, బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై మార్గదర్శకాలను ఖరారు చేయడమే  లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.


ఫింగర్‌ 4, 8ల మధ్య తరలించిన బలగాలను చైనా పూర్తిగా వెనక్కి తీసుకోవాలని భారత్‌  డిమాండ్‌ చేస్తున్నది.  చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా, హాట్‌స్ర్పింగ్స్‌, గల్వాన్‌లోయ నుంచి వెనక్కి వెళ్లిన విషయం తెలిసిందే.  14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరిందర్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత బృందం చర్చల్లో పాల్గొననుంది.   చుషూల్‌-మోల్డో సరిహద్దులో మధ్యాహ్నం చర్చలు ప్రారంభంకానున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com