విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్లో ఈ పేలుడు. సంభవించింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చాలా దూరంగా అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి. మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.