ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర విభజనలో ఆంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2017, 12:20 AM

మేజర్‌న్యూస్‌, చంద్రగిరి  : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి జూన్‌ 2న రాష్ట్రాన్ని చీకటి రోజులుగా మిగిల్చారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నవనిర్మాణ దీక్ష చంద్రగిరి పరిశీలకుడు జూపూడి ప్రభాకరరావు అన్నారు. చంద్రగిరి వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో గురువారం నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రతిజ్ఞ చేయించడం టివిలో చూసి ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధుల చేత జూపూడి ప్రభాకర్‌రావు నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులను, నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పాతాలానికి తొక్కారన్నారు. పెద్దన్నగా వ్యవహరించి ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నిలువ నీడ లేకుండా చేసి, ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాని ఎంతో పట్టుదలతో కృషి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. న్రపతి ఒక్కరు చంద్రబాబుకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.సి.పురం ఎంపిపి బింధుమాదవి, జెడ్పిటిసి గౌరిబాబు యాదవ్‌, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు, ప్రవీణ్‌కుమార్‌, ఎంపిటిసి సభ్యులు గౌస్‌ బాషా, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు అమ్ములు, నీలకంఠచౌదరి, తిరుపతి రూరల్‌ జెడ్పిటిసి సభ్యురాలు సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ 6 మండలాల ఎంపిడిఓలు డాక్టర్‌ వెంకట నారాయణ, వెంకటేశ్వర్లు, శిరీష, తాహసీల్దార్‌ గుణశేఖర్‌, టిడిపి నాయకులు లోకాద్రి, శరత్‌కుమార్‌, సక్కూరు ధనంజయరెడ్డి, భాగ్యలక్ష్మి, ఎంఇఓ లలితకుమారి, పలువురు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com