న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. జడేజా భార్య రీవా సొలాంకి గురువారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు జడ్డూకి శుభాకాంక్షలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జడేజా ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్నాడు. మరికొద్దిసేపట్లో భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ ప్రారంభం కానన్న ఈ నేపథ్యంలో రీవా సొలాంకి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. దీంతో లండన్లో ఉన్న జడేజా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ శుభవార్తను సహచర ఆటగాళ్లతో పం చుకున్నాడు. దీంతో భారత్ శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది. 2016 ఏప్రిల్లో జడేజా-సొలాంకి వివాహం జరిగింది. చాంపియన్స్ ట్రోఫీకి బయలుదేరే ముందు జడేజా మాట్లాడుతూ... ‘‘గర్భవతి అయిన నా భార్యను వది లి వెళ్తున్నా ను. ఈ టోర్నీకి నేను ఆడడం ఎంతో అవసరం. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ పాక్తో జరగనుంది. మా కుటుంబసభ్యులు ఆమెకు తోడుగా ఉంటారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని అన్నాడు.