ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత కక్షలతో ఇరువర్గాల మధ్య దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 01:57 PM

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పోట్లూరు పంచాయతీలోని కృష్ణాపురంలో సోమవారం రాత్రి దారుణం జరిగిందీ. వివరాల్లోకి వెళ్ళితే.... గ్రామానికి చెందిన మండల రామకృష్ణ గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థికి మద్దతుగా వ్యవహరించడంతో అతనికి వైసీపీ కార్యకర్తలకి మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం రాత్రి ఆయన తన ఇంటికి వెళుతుండగా దారిలో హుస్సేన్‌, బికారి, గంధం పెద్ద అయ్యన్న, వినయ్‌, నాసరయ్య, హజరత్‌, నాగూర్‌లతో పాటు మరికొందరు క్రికెట్‌ బ్యాటుతో దాడి చేశారు. దీనితో రామకృష్ణ  కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొన్నారు. ఇరువర్గాలు వాగ్వాదం చేస్తుండటంతో పోలీసులు వారించి రామకృష్ణను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com