ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ మాటలపై స్పందించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2020, 06:42 PM

కొన్నిరోజుల కిందట అమరావతిలో రైతుల ఆందోళనలపై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ స్పందిస్తూ, ఆడి కార్లు, గోల్డ్ చెయిన్లు, ఖద్దరు షర్టులో కనిపిస్తున్నారు, వీళ్లంతా నిజంగానే రైతులేనా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. రైతుల వద్ద సెల్ ఫోన్లు, బంగారుగొలుసులు ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న రైతులను చులకన చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న మహిళలు, రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మందడంలో రైతులకు సంఘీభావం తెలిపిన సందర్భంగా గల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com