విశాఖకు సచివాలయం తరలింపునకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 20, 21న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల18న కేబినెట్ సమావేశంలో సచివాలయం తరలింపు షెడ్యూల్పై చర్చిస్తారు. రిపబ్లిక్ డే వేడుకలు విశాఖలోనే జరిగే అవకాశం ఉంది. 23లోపు సచివాలయం తరలింపు ప్రారంభం కావాలని జోతిష్యుల సూచించారని సమాచారం. కేబినెట్ సమావేశం రిపబ్లిక్ డే కంటే ముందే జరగనుంది. విడతలవారీగా సచివాలయం తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 5శాఖలను తరలించాలని హెచ్వోడీల ఆదేశాలు అందాయని తెలుస్తోంది.