పులివెందుల మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం రోజు రాష్ట్ర పురపాలిక సంచాలకులు విజయ్ కుమార్ పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సచివాలయ సిబ్బంది నిరసన చేశారు. ఈ సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అన్ని వార్డుల సభ్యులు, సచివాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.