కర్ణాటకలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాదులున్నారని ఎన్ఐఎ చెప్పిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి బస్వరాజ్ బొమ్మాయి అన్నారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాలు జెఎంబి ఉగ్రవాదుల స్థావరాలుగా మారుతున్నాయని ఎన్ఐఎ పేర్కొందని ఆయన అన్నారు. రాష్ట్ర పోలీసులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఉగ్రవాదుల కదలికలు కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ, మధ్య కర్ణాటకలోనూ అధికమవుతున్నాయని ఆయన చెప్పారు.