గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు సోమవారం ఊపందుకున్నాయి. ఈ నెల నుంచి వరుసగా దసరా,దీపావళి ఇలా పండుగ సీజన్ ఆరంభం కావటంతొ పాటు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ధరలు పెరిగాయని ట్రేడర్లు చోఎపుతున్నారు. గత శుక్రవారం పసిడి ధర నెల రోజులలో కనిష్టానికి పడిపోయి 10 గ్రాములకు రూ.37,438గా ఉంది. ఈ రోజు రికవరీ అయింది. బంగారం ధర రూ.500 వరకు పెరగటం విశేషం.