భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు పర్యటనకు వెళ్లారా, అక్కడి ఎన్నికల ప్రచారానికి వెళ్లారా అంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ వరుస ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించారు. 'మీరు అమెరికాలో మా ప్రధానిగా ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో స్టార్ ప్రచారకర్తగా కాదు' అని ఆయన ట్వీట్ చేశారు. వేరే దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోరాదని ఏళ్ల తరబడి అనుసరిస్తూ వస్తున్న భారత విదేశాంగ విధానాన్ని, విలువలను ప్రధాని మోదీ ఉల్లంఘించారని మరో ట్వీట్లో ఆనంద్ శర్మ ఆరోపించారు. అమెరికాతో ఏళ్ల తరబడి మన సంబంధాలు ఇటు రిపబ్లికన్లు, అటు డెమోక్రాట్లకు సమ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయని, ఇండియా, భారత్ రెండూ సౌర్వభామాధికార, ప్రజాస్వామ్య దేశాలనీ, ట్రంప్ తరఫున మీరు చేస్తున్న చురుకైన ప్రచారం వీటిని అతిక్రమించేలా ఉందని ఆనంద్ శర్మ మరో ట్వీట్లో ఘాటు విమర్శలు చేశారు.