టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమలలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం. అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి తరలింపు.టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటీ నియామకం.అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన రూ. 150 కోట్లను రూ. 36 కోట్లకు కుదింపు. గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధుల కేటాయింపు.