రాజస్థాన్ లో క్రిమినల్స్ ని వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించారు పోలీసులు.13 మంది నేరస్థులను సంకెళ్లు వేసి బెహ్రోర్ అనే పట్టణంలో బట్టలు ఊడదీసి లోదుస్తులపైనే మార్కెట్ లో పరేడ్ చేయించారు. ఓ పెద్ద క్రిమినల్ తప్పించుకుని పారిపోయేందుకు సహకరించారని ఆ 13 మందిపై ఆరోపణలున్నాయి. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు… మార్కెట్ లో క్రైమ్ సీన్ క్రియేట్ చేశారు. నిజాలను వెరిఫై చేసుకునేందుకే పోలీసులు అలా చేయాల్సి వచ్చిందన్నారు భివాడీ జిల్లా ఎస్పీ ఎ ఎస్ కపూర్ చెప్పారు. అందులో పోలీసుల తప్పేమీ లేదన్నారు.