ప్రజాకోర్టు నిర్వహించి పదో తరగతి చదువుతున్న విద్యార్థి ని మావోయిస్టులు హత్య చేశారు. చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీజాపూర్ ఎస్పీ దివ్యాంగ్ పటేల్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన రమేశ్ కుంజాం పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని ఈనెల 16న మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. ప్రజాకోర్టులో స్టూడెంట్ను హత్య చేశారు. దీన్ని చూసి భయపడి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాలుడి అంతిమసంస్కారం చేశారు.