ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయంలో పోలీసులుపై ఈ ఉదయం కాల్పులు జరిగాయి. అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఓ గ్యాంగ్ కొందరిని మోసం చేసి పరారైంది. ఈ క్రమంలో వారి కోసం పోలీసులు గాలిస్తుండగా అక్షరధామ్ ఆలయ సమీపంలో ఓ వాహనం వేగంగా దూసుకెళ్తూ పోలీసుల కంట పడింది. గమనించిన పోలీసులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద మోసం చేసిన గ్యాంగ్ అదేనని అనుమానించి వాహనం ఆపాలని కోరారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన అందులోని నలుగురు దుండగులు పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం గీతా కాలనీ ఫ్లై ఓవర్ దిశగా పరారయ్యారు. కాల్పులతో విస్తుపోయిన పోలీసులు వెంటనే తేరుకుని వారిని వెంటాడి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడిందీ, లేదనిదీ తెలియరాలేదు. కాల్పులు జరుపుతూ నిందితులు మాత్రం పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.