ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై నగరంలో మహాత్మా గాంధీకి అరుదైన సంస్మరణ

national |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 05:02 PM

చెన్నై మహానగరంలో కాంగ్రెస్‌ కమిటీ జాతిపతి మహాత్మాగాంధీ సేవలను స్మరిస్తూ దేశంలోనే అత్యధిక ఎత్తుతో ఓ పతాక స్తంభాన్ని నెలకొల్పనుంది. ఈ మేరకు నగరంలోని స్థానిక రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో శనివారం పతాకస్తంభస్థాపన, పునాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మేళతాళాల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పునాది రాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి మాట్లాడుతూ... మహాత్మాగాంధీ 150వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని టీఎన్‌సీసీ తరపున దేశంలోనే అతి పెద్ద పతాక స్తంభాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ పతాక స్తంభంపై సంవత్సరంలో ఏడుసార్లు పార్టీ జెండాను మోటార్‌ పంపింగ్‌ సాయంతో ఎగురవేయనున్నట్టు తెలిపారు. వచ్చే జనవరి నాటికి ఈ పనులు పూర్తవుతాయని, గాంధీజి వర్ధంతి రోజున 150 అడుగుల ఎత్తు పతాకస్తంభంపై పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుమారి అనంతన్‌, టీఎన్‌సీసీ కార్యదర్శి కె.చిరంజీవి, మాజీ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరసర్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com