ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ ఎంపీ కారుపై దాడి.. తీవ్రంగా గాయపడ్డ అర్జున్ సింగ్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2019, 05:23 PM

ఉత్తర 24 పరగణాస్ లోని శ్యామ్ నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపైనా దాడి జరిగింది. ఈ దాడిలో… ఎంపీ అర్జున్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ కార్యకర్తలు… బీజేపీ ఆఫీస్ ను ముట్టడించడానికి వచ్చారు. ఆ సమయానికి నేను కారులో అక్కడికి వచ్చాను. కానీ.. తృణమూల్ పార్టీ కార్యకర్తలు నా కారును కూడా వదల్లేదు. కారుపై దాడిచేశారు. కారులోంచి దిగిన నన్ను కూడా కొట్టారు. పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ నా తలపై లాఠీతో కొట్టాడు. అని తలకు కట్టుతో.. ఒంటిపై రక్తగాయాలతో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com