ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బాల్టిక్ దేశాలైన లాట్వియా, లిథువేనియా ఎస్టోనియా దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఐదు రోజులపాటు ఈ దేశాల్లో పర్యటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఈ దేశాల అధినేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలోనూ ఈ మూడు దేశాల మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.