ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 06, 2019, 11:57 AM

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో దిగువన ఉన్నతెలంగాణా , ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.ప్రస్తుతం 2.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు చెప్పారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 866.8 అడుగులుగా ఉంది.జలాశయ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 129.15గా నమోదైంది.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.హంద్రీనీవాకు 1,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.మరో రెండు రోజులు ఇదే ప్రవాహం కొనసాగినట్లయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు భారీగా నీరు చేరుతుండటంతో పాటు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న నీరు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో, ఇక్కడి ప్రకృతి  అందాలు తిలకించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతూ, వేలాది మంది వస్తున్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com