తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రధాన పార్టీగా ఉండబోతుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు తమను సంప్రదించారన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో.. టీడీపీ పైనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామన్నారు.