అమరావతిపై అధికార పక్ష నేతలకు ఎంత అక్కసు ఉందో తెలుస్తోందని తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకోవడంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేపట్టామన్నారు. గతంలో హైదరాబాద్ అభివృద్దికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అడ్డుపడలేదన్నారు. ప్రపంచ బ్యాంకుకు లేఖలు ఇవ్వడానికి మీరు నాంది పలికారని చంద్రబాబు అన్నారు.