బెంగళూరు : అధికారాన్ని లాక్కునేందుకు కుట్ర జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. శాసనసభలో విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. బిజెపి సహకారంతోనే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన చెప్పారు. నిర్దుష్ట సమయంలోగా చర్చను ముగిస్తామన్న హామీ ఏమీ ఇవ్వలేమని అన్నారు. విశ్వాస పరీక్షకు ముందు జరుగుతున్న చర్చను నిర్దిష్ట సమయంలో ముగిస్తామని తాను చెప్పలేను అన్నారు. విశ్వాస పరీక్షకు ముందు చాలా విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.