ఖమ్మం : నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో మైనర్ బాలబాలికలను అక్రమంగా తరలించడం కలకలాన్ని రేపింది. తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్కు రైలులో అక్రమంగా తరలిస్తున్న 13 మంది మైనర్ బాలికలు, 16 మంది బాలురను పోలీసులు కాపాడి ఖమ్మంకు తరలించారు. మైనర్లకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.