మరో 5 రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా, భారత జట్టు న్యూజిలాండ్ తో శనివారం సన్నాహక మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అందరి కళ్లు కోహ్లీ సేన పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మాజి వెస్టిండీస్ క్రికెటర్ దిగ్గజం లారా.. ' కోహ్లీ మనిషి కాదు, యంత్రం. 80, 90 లతో పోలిస్తే..అతడు విభిన్నమైన క్రికెట్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. క్రికెట్ లో ఫిట్నెస్ ప్రాధాన్యతను చాటాడు ' అని పేర్కొన్నారు.