తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం ఉదయం స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప వ్యాఇద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో విహరించి యధాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారధి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. సాయం్త్రం 3 నుంచి 4.30 గంటల వరకు అర్చకులు రథమండపం నందు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి.
అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యు పాయాలను ఆశ్రయి ంచి, తరించ మని ప్రబోధిస్తున్నాడు. ఈ కార్యక్ర మంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీ యర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటి ఇఓ బి.మునిలక్ష్మి, ఎస్ఇలు రమేష్రెడ్డి, రాములు, ఆలయ సూపరింటెండెంట్ పి.ఉమామ హేశ్వర్రెడ్డి, ఇతర అధికారులు, ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.