నరసాపుం,మొగల్తూరుః గురువారం నాడు ఆనంద్ ఆక్వా పుడ్ ప్రాసెసింగ్ ప్యాక్టరీలో ఘటనలో ఐదుగురు వ్వక్తులు మృతి చెందిన సంగతి విధితమే. అయితే వీరి మృతికి విధ్యుత్ షాకే కారణ మంటున్నారు ప్రత్యక్ష స్యాక్షులైన కుక్కల సత్యనారాయణ, కుక్కల నాగరాజులు. శుక్రవారం నరసాపురం పట్టణంలోని ఐక్య ఎమర్జెన్సీ అసుపత్రిలో చికిత్సకోసం వచ్చిన వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కుక్కల సత్యనారాయణ తెలియజేసిన వివరాల ప్రకారం మొగల్తూరులోని కుక్కల వారి తోటలో వేంచేసి యున్న ‘చెట్టు కింద ముత్యాలమ్మ ’ అమ్మ వారి జాతర కోసం చందాలు వసూలు చేసే క్రమంలో ఆనంద్ ఆక్వా పుడ్ ప్రాసెసింగ్ ప్యాక్టరీ అవరణలోకి గురువారం ఉదయం 9 గంటలపాటు తనతో పాటు నాగరాజు మరికొందరితో కలసి వెళ్ళామని ఆ సమయంలో ట్యాంక్లో నుండి బిగ్గరగా అరుపులు వినిపించి ట్యాంక్ దగ్గరకి వెళ్ళి వారిని రక్షించే ప్రయత్యంతో ట్యాంక్ పైకి ఎక్కే ప్రయత్నం చేసామన్నారు. అయితే ట్యాంక్ పై విధ్యుత్ ప్రవహించడంత షాక్కు గురై తన కుడి చేయికి గాయాలయ్యాయన్నారు. వెంటనే తేరుకొని పరిసర ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ పైపు సహాయంతో ట్యాంక్పై ఉన్న వ్వక్తిని కాపాడానని తెలిపారు. తన వెంట ఉన్న నాగరాజు ప్రక్కనే గోడపై ఉన్న మెయిన్ ఆఫి విధ్యుత్ ప్రవాహం ఆపాడన్నారు. అయితే ట్యాంక్లోంచి వచ్చిన అరుపులకు ప్యాక్టరీలోని సిబ్బంది ట్యాంక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసామని విధ్యుత్ మెయిన్ ఆపే లోపే మరో ముగ్గురు ట్యాంక్పైకి ఎక్కి మృత్యవాత పడ్డారని సత్యనారాయణ తెలిపాడు.తన వెంట ఉన్న నాగరాజు విధ్యుత్ మెయిన్ ఆపకపోతే చాలా మంది విధ్యుధ్ఘాతానికి గురి అయ్యేవారని తెలిపాడు. అంతే గాకుండా తాను విద్యుత్ శాఖ ఏఇ కి పోన్ చేయడంతో ప్యాక్టరీకి విధ్యుత్ ఆపడం జరిగిందన్నారు.ఈ ఘటనలో విధ్యుత్ షాక్కు గురై త్రీవ గాయాలైన నల్లం సత్యనారాయణను తాము నరసాపురం పట్టణంలోని ఐక్య ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకువచ్చామని కోలుకుంటున్నాడని తెలిపారు. ప్యాక్టరీ సిబ్బంది, స్థానికులు వాస్తవాలను గ్రహించకుండా కేవలం ట్యాంకులో విషపూరిత వాయువులే కారణమంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని ఇది నిజం కాదని , విధ్యుత్ షాక్వల్ల తన చేతికి అయిన గాయాన్ని చూపించాడు. విధ్యుత్ శాఖాధికారలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కుక్కల సత్యనారాయణ తెలిపాడు. నిన్నటి ఘటన జరిగినప్పుడు మృతుని బందువులు,స్ధానికులుకు ఈ విషయం చెప్పే ప్రయత్నం చేసినప్పటికి వందల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో విధ్యుత్షాక్ విషయం మరుగున పడి, విషప్రభావంతో మృతి చెందారన్న ప్రచారం రావడం విచారకరమన్నారు.