వెలగపూడి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి: రాష్ర్ట మంత్రివర్గం విస్తరణకు ఆదివారం ముహుర్తం ఖరారు అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికార యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లపై దష్టిసారించింది. వెలగపూడి సచివాలయంలోని ఆరుబయట సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలనాశాఖ నిర్ణయించింది. కేవలం ఒక్క రోజుమ్త్రామే సమయం ఉండడంతో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు ఏర్పాట్లుపై సమీక్షించారు. ప్రమాణ స్వీకారోత్సవ సభ, ఆయా మార్గాల్లో బందోబస్తు చర్యలు చేపట్టడానికి కనీసం 1500 మంది పోలీసులను మోహరిస్తు న్నారు. 40 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు, 300 మంది ఎస్సైలు, 800 నుంచి 900 మంది కానిస్టేబుళ్లు శాంతిభద్రతల అదనపు డీజీ హరీష్కుమార్ గుప్తా నేతత్వంలో బందోబస్తులో పాల్గొంటారు. ఇప్పటికే శాసనసభ సమావేశాలను దష్టిలో పెట్టుకుని గుంటూరు-విజయవాడ ప్రధాన రహదారితో పాటు గుంటూరు-వయా తాడికొండ, తుళ్లూరు మీదుగా వెలగపూడి మార్గాల్లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసే వరకు వాటిని కొనసాగిస్తారు. మొత్తం ఆరు మార్గాల్లో వాహనాలను అనుమతించాలని నిర్ణయిం చారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే కరకట్ట మార్గం నుంచి మంు్తల్రు, ఇతర ముఖ్యులను ఉండవల్లి సెంటర్ కష్ణాయపాలెం మీదగా వెలగపూడి మంగళగిరి పట్టణ నుంచి ఎర్రబాలెం మీదగా వెలగపూడి నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా కంతేరు రోడ్డులో నుంచి ఐనవోలు మీదగా వెలగపూడి గుంటూ రు వయా తాడికొండ, తుళ్లూరుమీదగా వెలగపూడి అమరావతి నుంచి వయా బైపాస్ రహదారి, తుళ్లూరు మీదగా వెలగపూడికి రహదారుల్లో ఎకక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి ఎక్కడా ట్రాఫిక్ చిక్కులు లేకుంలడా చూడటానికి పోలీసు ఉన్నతాధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. స్టైయికింగ్ ఫోర్సు, మొబైల్ బందాలు, ఏఎన్ఎస్ పోలీసులు ఇలా మూడు విభాగాలుగా విభజించి ప్రమాణస్వీకారానికి బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కనున్న ఎమ్మెల్యేలకు శనివారం రాత్రి 10 గంటల తర్వాత ముఖ్యమంత్రి లేదా ఆయన పేషీ నుంచి ఫోన్లో సమాచారమిస్తారని అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఆదివారం నిర్దేశిత ముహూర్త సమయానికి ఆయన్ని పోలీసు భద్రత నడుమ తీసుకెళ్లటానికి గుంటూరు జిల్లా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రాయలసీమ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు కూడా గుంటూరు నుంచే వెళ్లాల్సి ఉండటంతో వారికి నగరంలోకి ప్రవేశించగానే పోలీసు ఎస్కార్టు మధ్య సకాలంలో ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేర్చటానికి ఒక్కో డీఎస్పీని ఇంఛార్జిగా పెడుతున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.