ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటారుుంచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 12:56 AM

   విజయవాడ, సూర్య బ్యూరో : వత్తి నిబద్ధత గల పాత్రికేయులంటే గౌరవం వున్నదని, వారి న్యాయమైన సమస్యల పట్ల సానుభూతి ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం మధ్యాహ్నం శాసనసభ వాయిదా అనంతరం తనను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన పాత్రికేయులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. నవ్యాంధ్రలో జరిపిన ఏపీజేఎఫ్‌ తొలి ప్లీనరీ విజయవంతం అయిందని తెలుసుకుని ఆయన అభినందనలు తెలిపారు. పాత్రికేయ రంగంలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా పని చేస్తున్న ఎంతోమంది తనకు తెలుసునని, ఈ వత్తిలో నిరుపేదలున్నారని అన్నారు. అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టులు కూడా సంతప్తి గల జీవన ప్రమాణాలతో సంతోషంగా ఉండాలని అభిలషిస్తున్నానని చెప్పారు. ఏపీజెఎఫ్‌ తన దష్టికి తెచ్చిన సమస్యలన్నీ పరిశీలించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అపరిష్క తంగా ఉన్న పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఏపీజేఎఫ్‌ ప్రతినిధులు సీఎంకు ఈ సందర్భంగా ఒక వినతిప్త్రం సమర్పించారు. అలాగే, విలేకరుల సంక్షేమ నిధికి వెంటనే తగిన కేటాయింపులు జరపాలని కోరారు. వారి సమస్యలను సానుభూతితో పరిశీలించిన తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో ఏపీజేఎఫ్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు చెవుల కష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మారెళ్ల వంశీకష్ణ తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com