విశాఖ: వైకాపా అధినేత వైఎస్ జగన్ భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖలోని మంత్రి కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యేగా తాను లక్ష మెజార్టీతో విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ సామాన్య కార్యకర్తను కూడా కదిలించలేని స్థితిలో వైకాపా ఉందని ఎద్దేవా చేశారు. కార్యకర్తల అంతర్గత సమస్యల పరిష్కారానికి కోర్కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.