పశ్చిమ గోదావరి : ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో మూడు రోజుల సమ్మెలో భాగంగా ఏలూరు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్స్ నాయకులు మాట్లాడుతూ.. 15 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని, బిఎస్ఎన్ఎల్ కు ఫోర్ జి స్పెక్ట్రమ్ కేటాయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.