ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 07:04 PM

ఢిల్లీలో నేడు వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం నెలకొంది. దాంతో సహనం కోల్పోయిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ టేబుల్ పై ఉన్న గాజుతో తయారైన వాటర్ బాటిల్ ను విసిరారు. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ బొటనవేలు, చిటికెనవేలుకి గాయాలయ్యాయి. ఆయనను మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీకి వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ఈ ఘటనతో జాయింట్ పార్లమెంటరీ సమావేశానికి కొద్దిసేపు అంతరాయం కలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com