ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధికి కావలసిన అన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 05:12 PM

రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జల వనరులు, ఖనిజ వనరులు, సువిశాలమైన కోస్తా తీరం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి వంటి అభివృద్ధికి అవసరమైన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అందరికంటే ముందు చంద్రబాబు మాట్లాడారు. దాదాపు ఏడు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో గత కొంతకాలంగా తాను చేస్తున్న వినూత్న ప్రతిపాదన పీ-4 గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరినప్పుడు సమావేశంలో సానుకూల ప్రతిస్పందన లభించింది. ఇప్పటి వరకూ అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) వల్ల వచ్చే లాభాలేమిటో దేశానికి తెలుసని, కానీ ఇందులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా నాలుగో ‘పీ’ కూడా చేరితేనే పేదరిక నిర్మూలన సాధ్యమని వివరించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన సున్నా పేదరికం లక్ష్యాన్ని సాధించాలంటే పీ-4 అమలు చేయాలని తెలిపారు. సాంకేతికతను పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పారు. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com