ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూజీలాండ్ పై భారత్ ఘనవిజయం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 23, 2019, 04:38 PM

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 38 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 34.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 156 పరుగులుగా నిర్దేశించారు. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించి న్యూజిలాండ్ పర్యటనను ఘనంగా ఆరంభించింది.

న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన శిఖర్ ధవన్ వేగంగా 5 వేల పరుగులు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐదు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే ఈ నెల 26న బే ఓవల్‌లో జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com