ట్రెండింగ్
Epaper    English    தமிழ்

175 అసెంబ్లి, 25 పార్లమెంటు సీట్లలో పోటీ : ఊమెన్‌ చాందీ

Andhra Pradesh Telugu |   | Published : Wed, Jan 23, 2019, 04:58 PM

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లి స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 31వ తేదీన మరొకసారి సమావేశమై చర్చిస్తామని ఆయన అన్నారు. ఎఐసిసి ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ వారంలోనే కమిటీలపై ఒక నివేదికను అధిష్టానానికి పంపిస్తామని ఊమెన్‌చాందీ చెప్పారు. ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ నెల 31న సమావేశంలో దీనిపై కూడా సమగ్రంగా చర్చిస్తామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com