పలాస సీతారామ్నగర్ కాలనీలో కుక్కల దాడిలో అదే ప్రాంతానికి చెందిన పాతా ల మేఘన అనే ఐదేళ్ల బాలిక తీవ్ర గాయాల య్యాయి. ఆమెను సమీపంలో ఉన్న సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. మేఘన తన ఇం టి నుంచి ఆటాడుకోవడానికి ఎదురింటికి వెళ్లే క్రమంలో వీధి కుక్కలు దాడి చేసి ఛాతీ, చేయి, ముఖంపై కరిచాయి. స్థానికులు చూసి కుక్కల ను తరమడంతో బాలిక చిన్నపాటి గాయాలతో బయటపడింది. యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందు బాటులో ఉండడంతో వాటిని వినియోగించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండడంతో స్థానికులు భయందోళనకు గురవుతు న్నారు. కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి మొత్తం తొమ్మిది మంది పాదచారులకు కరిచిన విషయం పాఠకులకు విధితమే. తరచూ కుక్కలు పాదచారులను వెంబడిస్తూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలబారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.