పలాస పరిధిలోని నందిగాం మండలం పాలవలస సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలకు గాయాలయ్యాయి. నందిగాం హెచ్సీ ఢిల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నర్సిపురం కృష్ణారావు, పాపమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై టెక్కలి వస్తుండగా పాలవలస వద్ద అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. దీంతో భార్యాభర్తలకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ ఢిల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.