ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పటిష్టంగా చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 12:33 PM

ఇంటర్‌ సప్లిమెంటరీ, పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం డీఆర్‌వో ఇంటర్మీడియట్‌, పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, అదేవిధంగా ఈనెల 24 తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 54పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరం 28,668 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 6,545 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 6,702 మంది రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి 35 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 35 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నలుగురు రూట్‌ ఆఫీసర్లను నియమించామన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధించడంతో పాటు పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీములు కూడా పరీక్షలు జరిగే సమయంలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణను సీసీ కెమేరాలు, వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పరిశీలించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకొనేందుకు వీలుగా విద్యార్థులకు ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తపాలా కార్యాలయం ద్వారా జవాబు పత్రాలను స్పీడు పోస్టులో పంపేందుకు సిద్ధంగా వుండాలన్నారు. ఇంటర్మీడియట్‌, పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని డీఆర్‌వో అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ సీఎ్‌సఎ్‌సఎన్‌ రెడ్డి, డీఈవో యు.వి.సుబ్బారావు, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ కెవీఎన్‌ కుమార్‌, డీఈసీ సభ్యులు శ్రీరామమూర్తి, వెంకట్రావు, ఆర్యపత్‌ వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com