వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. లండన్కు వెళ్లటం కాదు... జగన్ ఉత్తరప్రదేశ్కు వెళ్లాలని.. అక్కడ శాంతి భద్రతలను గురించి యోగి ఆదిత్యనాథ్ నుంచి నేర్చుకోవాలని హితవుపలికారు. అక్కడ 11 వేల మంది బెయిల్ రద్దు చేసుకుని జైళ్లకు వెళ్లారన్నారు. పోలీసులు ఉన్నా దౌర్జన్యాలు చేసే లెక్కలేని తనాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. కనిపించకుండా గొడవలకు కారణమైన కర్త కర్మ క్రియగా ఉన్న వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమే అని భానుప్రకావ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.