ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని గుండ్లమోటు ప్రాజెక్టును శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఇరిగేషన్ ఏ. ఈ తో కలిసి సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది ఆ వరద నీరు వృధాగా ప్రాజెక్టు నుంచి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రాజెక్టును సందర్శించారు. నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.