సంతమాగులూరు మండలంసంతమాగులూరు లోని గ్రంథాలయ శాఖ నందు శుక్రవారం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ ఆల్తాఫ్ పాల్గొని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పై శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు. నెల రోజులపాటు ఈ శిక్షణ శిబిరం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.