ధర్మవరంలోని బ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామని, యావన్మంది భక్తులు విరివిగా విచ్చేసి స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించాలని కోరారు.